టీపీసీసీ అధికార ప్రతినిధి ‘అద్దంకి’పై పార్టీ కార్యకర్తల దాడి

టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌పై సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు చేయిచేసుకున్నారు. ఓ వివాహ వేడుకకు

Published : 23 May 2022 04:33 IST

తుంగతుర్తి, న్యూస్‌టుడే: టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌పై సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు చేయిచేసుకున్నారు. ఓ వివాహ వేడుకకు భార్యాబిడ్డలతో అద్దంకి దయాకర్‌ హాజరయ్యారు. ఆయన వచ్చేటప్పటికే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయనను పట్టించుకోకుండా దయాకర్‌ వెళ్లిపోవడంతో దామోదర్‌రెడ్డి వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. అనంతరం దామోదర్‌రెడ్డి వధూవరులను ఆశీర్వదించి వెళ్లిపోయారు. తర్వాత దయాకర్‌ భోజనం చేసి వాహనం దగ్గరకు వెళ్లబోతుండగా, కొందరు కార్యకర్తలు ఆయనపై దూషణకు దిగారు. ‘నీ వల్ల ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలుగుతోంది. నువ్వు కనిపించకుండా పోయావు.. కార్యకర్తల పరిస్థితి ఏమిటి’ అని ప్రశ్నిస్తూ అయిదారుగురు ఆయనపై చేయిచేసుకున్నారు. డ్రైవరు, మరో కార్యకర్త బిక్కి శ్రీనులపైనా దాడి చేశారు. అక్కడున్న కొద్దిమంది సహకారంతో దయాకర్‌ కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆయన భార్యాపిల్లలు బిక్కుబిక్కుమంటూ మరో కారులో అనుసరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని