ప్రజా ప్రస్థానం పాదయాత్ర 28న పునఃప్రారంభం

ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ నెల 28న సత్తుపల్లి నుంచి పునఃప్రారంభం కానుందని వైతెపా అధికార ప్రతినిధి దేవేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 25 May 2022 04:47 IST

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ నెల 28న సత్తుపల్లి నుంచి పునఃప్రారంభం కానుందని వైతెపా అధికార ప్రతినిధి దేవేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాదయాత్రలో అడుగడుగునా ప్రజా సమస్యలను పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలుసుకుంటున్నారని చెప్పారు. షర్మిలపై మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పంచె కట్టినంత మాత్రాన నిరంజన్‌రెడ్డి రైతు అయిపోరన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని