మోదీ ప్రభుత్వ ప్రగతిని, పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తాం: లక్ష్మణ్‌

కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో సాధించిన ప్రగతిని, సంక్షేమ పథకాలను.. అదే సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని రాష్ట్రంలో ఇంటింటికి తీసుకెళ్తామని, ఈ నెల 30 నుంచి జూన్‌ 14 వరకు ఈ కార్యక్రమం సాగుతుందని భాజపా

Published : 25 May 2022 04:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో సాధించిన ప్రగతిని, సంక్షేమ పథకాలను.. అదే సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని రాష్ట్రంలో ఇంటింటికి తీసుకెళ్తామని, ఈ నెల 30 నుంచి జూన్‌ 14 వరకు ఈ కార్యక్రమం సాగుతుందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పట్టించుకునే నాథుడు కరవయ్యాడని, తెరాసకు కాలం చెల్లిందన్నారు. ఈ రెండు పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని, భాజపా మాత్రం అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ప్రజల్లోకి వెళ్తుందని చెప్పారు.మోదీని ఎదుర్కొనే ధైర్యం లేకే కేసీఆర్‌ ప్రొటోకాల్‌ పాటించట్లేదని ఆక్షేపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని