
పదవులే పరమావధి కాదు
పార్టీ విజయమే ధ్యేయం కావాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాస ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: ‘‘వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయమే అందరి ధ్యేయం కావాలి. ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అందరికీ ఒకేసారి అవకాశాలు రావు. సమయానుకూలంగా వస్తాయి. పదవులే పరమావధి కాదు. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యమిస్తాం’’అని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విపక్షాలు కాకమ్మ కబుర్లు చెబుతూ విషప్రచారం చేస్తున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆయన సూచించారు. తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నేతలు సీఎం కేసీఆర్ను బుధవారం ప్రగతిభవన్లో కలిశారు. ఖమ్మం జిల్లాకు చెందిన బండి పార్థసారథిరెడ్దితో పాటు జిల్లాతో చిరకాల అనుబంధం ఉన్న వద్దిరాజు రవిచంద్రలకు రాజ్యసభ స్థానాలు కేటాయించడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారితో సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లా తెలంగాణకు గుమ్మం లాంటిదని, అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాలని, అందరూ కలసికట్టుగా పనిచేసి జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని కేసీఆర్ సూచించారు. ‘‘ఇటీవలి సర్వేల్లో జిల్లాలో పార్టీ బలంగా ఉందని తేలింది. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మరింత చేరువ కావాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాం. పెద్దఎత్తున నిధులను కేటాయించాం. సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తాం. అశ్వారావుపేట మండల కేంద్రంలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తాం. జిల్లా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు తమ ప్రతిపాదనలను సమర్పించాలి. అన్నింటినీ మంజూరు చేస్తాం. పార్టీలో విభేదాలు, అసంతృప్తి మాటలు వినిపించవద్దు. త్వరలోనే ఉమ్మడి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతా’’నని సీఎం అన్నారు. ఆయన్ను కలిసిన వారిలో ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ అభ్యర్థి బండి పార్థసారథిరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM KCR: తెలంగాణలో భూసమస్యల పరిష్కారానికి మండలాల్లో రెవెన్యూ సదస్సులు
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
-
Business News
matrimony: ఐఏఎస్, ఐపీఎస్ కాదట.. మ్యాట్రీమొనీ సైట్లో వెతికింది వీరి కోసమేనట..!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
YS Sharmila: తెరాస కార్యకర్తలను అరెస్టు చేయాల్సిందే.. జోరువానలో షర్మిల దీక్ష
-
Sports News
PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!