మున్ముందు తెరాసకు గుణపాఠం: ప్రవీణ్‌కుమార్‌

రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపి గుణపాఠం చెప్పాలని బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రజలను కోరారు.

Published : 26 May 2022 05:18 IST

దంతాలపల్లి, న్యూస్‌టుడే: రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపి గుణపాఠం చెప్పాలని బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రజలను కోరారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. బీరిశెట్టిగూడెం, దాట్ల, వేములపల్లి, కుమ్మరికుంట్ల, రామానుజాపురం, పెద్దముప్పారం, దంతాలపల్లి గ్రామాల్లో యాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు ఆధిపత్య వర్గాలకే ప్రయోజనం చేకూర్చాయన్నారు. బహుజనులంతా బీఎస్పీ వైపు రావాలని కోరారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అక్కడ చెలరేగిన హింస వెనుక లోతైన కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఇరువర్గాలు శాంతియుతంగా ఉండాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని