రైతుల్ని గాలికొదిలి పక్క రాష్ట్రాల్లో పర్యటనలా: అన్వేష్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో రైతులను గాలికొదిలేసి పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నారని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఛైర్మన్‌ అన్వేష్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు పట్టించుకోని కేసీఆర్‌..

Published : 27 May 2022 05:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో రైతులను గాలికొదిలేసి పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నారని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఛైర్మన్‌ అన్వేష్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు పట్టించుకోని కేసీఆర్‌.. పక్క రాష్ట్రాల రైతుల మీద ప్రేమ చూపడం కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు ఇచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. 25 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు పడుతున్నా, మిల్లర్లు తరుగు పేరిట అడ్డగోలుగా దోచుకుంటున్నా సీఎం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రోహిణి కార్తె మొదలై కర్షకులు పెట్టుబడులకు సిద్ధమవుతుంటే రైతుబంధు ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని