భాజపా పాలనలో దేశం నాశనమైంది : కాంగ్రెస్‌

నరేంద్ర మోదీ నేతృత్వంలోని 8 ఏళ్ల భాజపా పాలన ‘ఎనిమిదేళ్లు.. 8 మోసాలు’ అన్న రీతిలో సాగిందంటూ కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. ఈ మేరకు కేంద్రంలో భాజపా పాలనపై కాంగ్రెస్‌

Published : 27 May 2022 05:07 IST

దిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోని 8 ఏళ్ల భాజపా పాలన ‘ఎనిమిదేళ్లు.. 8 మోసాలు’ అన్న రీతిలో సాగిందంటూ కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. ఈ మేరకు కేంద్రంలో భాజపా పాలనపై కాంగ్రెస్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పించింది. అన్ని రంగాల్లో దేశం నాశనమైందని, ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల సంపద మాత్రమే భారీగా పెరిగిందని ఆరోపించింది. కాంగ్రెస్‌ నేతలు రణ్‌దీప్‌ సుర్జేవాలా, అజయ్‌ మకెన్‌ గురువారం దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం మోదీ చేసిన ‘అచ్ఛే దిన్‌’ నినాదం.. భాజపాకు, కొంతమంది కోటీశ్వరులైన పారిశ్రామికవేత్తలకే పరిమితమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా.. ఎనిమిదేళ్లలో భాజపా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ హిందీలో ఓ బుక్‌లెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని