పసుపు రైతులను ఆదుకోవాలి
నష్టాలు ఎదుర్కొంటున్న పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగింది.
బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్
కేసముద్రం, న్యూస్టుడే: నష్టాలు ఎదుర్కొంటున్న పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ కేసముద్రం వ్యవసాయ మార్కెట్ను సందర్శించి రైతులు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అమీనాపురంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధానంగా పసుపు రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఎకరాకు సుమారు రూ.50 వేల పెట్టుబడి పెట్టి పంట సాగు చేయగా వచ్చిన దిగుబడిని మార్కెట్లో విక్రయిస్తే కేవలం రూ.15 వేలు వస్తున్నాయన్నారు. ధాన్యం పండించిన ప్రతి రైతుకు మద్దతు ధర కల్పించాలని ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలను బహుజనులు గమనించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్