KTR: వండర్ఫుల్ కేటీఆర్!
‘వండర్ఫుల్ కేటీఆర్! నాయకత్వం, వినయం అనే అంశాలు విడదీయరానివి అనడానికి మీరు అసాధారణమైన ఉదాహరణగా నిలిచారు’ అంటూ మహీంద్రా గ్రూపు సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఇటీవల హైదరాబాద్ సనత్నగర్లో టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని.. మంత్రి కేటీఆర్తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో
ట్విటర్లో ఆనంద్ మహీంద్రా అభినందనలు
ఈనాడు, హైదరాబాద్: ‘వండర్ఫుల్ కేటీఆర్! నాయకత్వం, వినయం అనే అంశాలు విడదీయరానివి అనడానికి మీరు అసాధారణమైన ఉదాహరణగా నిలిచారు’ అంటూ మహీంద్రా గ్రూపు సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఇటీవల హైదరాబాద్ సనత్నగర్లో టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని.. మంత్రి కేటీఆర్తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వర్షం పడటంతో కేటీఆర్ స్వయంగా సీపీ గుర్నానికి గొడుగు పట్టారు. ఓ రాష్ట్రానికి మంత్రి, తమ కార్యక్రమానికి ముఖ్యఅతిథి అయిన ఆయన తన పట్ల చూపిన శ్రద్ధకు గుర్నానీ ముగ్ధుడయ్యారు. తన స్పందనను శుక్రవారం ట్విటర్ ద్వారా వెలిబుచ్చారు. ‘మీరు మనస్ఫూర్తిగా వ్యవహరించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. మీ స్థాయి వ్యక్తి నాకు గొడుగు పట్టడం అరుదైన విషయం. అందుకు నా కృతజ్ఞతలు’ అంటూ గుర్నాని.. తనకు కేటీఆర్ గొడుగు పట్టిన ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. తమ సంస్థ సీఈవో వ్యాఖ్య, ఫొటోను ట్యాగ్ చేస్తూ ఆనంద్ మహీంద్రా.. కేటీఆర్ను ట్విటర్లో అభినందించారు. దీనిపై స్పందించిన మంత్రి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం