Seethakka: కన్నీరు పెట్టుకున్న సీతక్క

మావోయిస్టు నేత హరిభూషణ్‌ మరణించడం బాధాకరమైన విషయమని, ఆయన ప్రజల మనిషి అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం హరిభూషణ్‌ మరణ వార్త

Updated : 25 Jun 2021 10:57 IST

గంగారం, న్యూస్‌టుడే :  మావోయిస్టు నేత హరిభూషణ్‌ మరణించడం బాధాకరమైన విషయమని, ఆయన ప్రజల మనిషి అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం హరిభూషణ్‌ మరణ వార్త తెలుసుకున్న ఆమె మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం మడగూడెంలోని ఆయన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు ఆమెపై పడి రోదించడంతో సీతక్క కూడా కన్నీరు పెట్టుకుని ఓదార్చారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో ఆయన టీం లీడరుగా ఉన్నప్పుడు తానూ ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఉద్యమంలో పనిచేశానని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని