Venkaiah Naidu: 9 నిమిషాల్లో వెంకయ్య చిత్రం
ఓ విద్యార్థి ప్రతిభను ప్రోత్సహించడానికి ఉపరాష్ట్రపతి 9 నిమిషాల పాటు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
విద్యార్థి కోరిక మేరకు ఆగిన ఉపరాష్ట్రపతి
శంషాబాద్, న్యూస్టుడే: ఓ విద్యార్థి ప్రతిభను ప్రోత్సహించడానికి ఉపరాష్ట్రపతి 9 నిమిషాల పాటు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ ప్రాంగణంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. ఈ విషయం తెలిసి శంషాబాద్ మండలం మదనపల్లి పాత తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి శివ అక్కడకు వచ్చాడు. ఎవరి చిత్రమైనా తలకిందులుగా ప్రారంభించి 10 నిమిషాల్లో వేయడంలో దిట్ట. ఉప రాష్ట్రపతి చిత్రాన్ని ఆ విధంగా వేస్తానని..ఆయనకు బహుమతిగా ఇవ్వాలని వేచి చూస్తున్నానని భద్రతాసిబ్బందిని వేడుకున్నాడు. దీంతో వారు అనుమతించారు. అప్పటికే విమానాశ్రయానికి బయలుదేరడానికి సమాయత్తమవుతున్న ఉపరాష్ట్రపతి వద్దకు శివ వెళ్లి సర్.. మీ చిత్రం వేస్తానని విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికే ఆలస్యమైంది. నా రాక కోసం శంషాబాద్, దిల్లీ విమానాశ్రయాల్లో ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నారు..అంటూనే సరే... 10 నిమిషాలు ఆగుతా వేయి చూద్దాం అన్నారు. శివ కేవలం 9 నిమిషాల్లోనే చిత్రాన్ని వేసి బహూకరించడంతో వెంకయ్యనాయుడు ఆశ్చర్యపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె