విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని.. ఇదే విషయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో సైతం ప్రకటించారని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారమిక్కడ విద్యుత్తు అకౌంట్స్‌..

Published : 29 Nov 2021 04:45 IST

వెంగళ్‌రావునగర్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని.. ఇదే విషయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో సైతం ప్రకటించారని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారమిక్కడ విద్యుత్తు అకౌంట్స్‌ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్తు సంస్థలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించి జాతీయస్థాయిలో కీర్తి గడించాయన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘాలతో కలిసి సీఎం కేసీఆర్‌ను త్వరలో కలుస్తామన్నారు. విద్యుత్తు అకౌంట్స్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్‌, అంజయ్య, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని