కొత్త ఎమ్మెల్సీలకు సీఎం అభినందనలు

శాసనసభ్యుల, స్థానిక సంస్థల కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. కడియం శ్రీహరి, పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి...

Published : 29 Nov 2021 04:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ్యుల, స్థానిక సంస్థల కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. కడియం శ్రీహరి, పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, వెంకట్రామరెడ్డిలు ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎంతో భేేటీ అయ్యారు. వారిని కేసీఆర్‌ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలవడంపై సీఎం సంతోషం వ్యక్తంచేశారు. మిగిలిన జిల్లాల నేతలు ఆదర్శంగా తీసుకొని ఎమ్మెల్సీ స్థానాలన్నింటినీ గెలిపించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని