ఓటుకు నోటు కేసులో స్టే పొడిగింపు

ఓటుకు నోటు కేసులో గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. కేసు నుంచి తన పేరు తొలగించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కేసును విచారించే అధికారం అవినీతి నిరోధక శాఖ కోర్టుకు లేదంటూ రేవంత్‌రెడ్డి గతంలో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

Published : 02 Dec 2021 05:16 IST

ఈనాడు, దిల్లీ: ఓటుకు నోటు కేసులో గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. కేసు నుంచి తన పేరు తొలగించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కేసును విచారించే అధికారం అవినీతి నిరోధక శాఖ కోర్టుకు లేదంటూ రేవంత్‌రెడ్డి గతంలో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు గత ఆగస్టులో స్టే విధించింది. జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు గతంలో విడుదల చేసిన ఉత్తర్వులు అమలవుతాయని ధర్మాసనం పేర్కొంది. కేసు తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు