యాదాద్రి స్వర్ణగోపురానికి రూ.50 లక్షల విరాళం

యాదాద్రిలో స్వర్ణగోపుర నిర్మాణానికి జూబ్లీహిల్స్‌కు చెందిన జీవీపీఆర్‌ మినరల్స్‌, వీరభద్ర మినరల్స్‌ అండ్‌ గ్రానైట్స్‌ ఎండీ జీవీ ప్రతాప్‌రెడ్డి, ఆయన తనయుడు, సంస్థ డైరెక్టర్‌ దినేష్‌రెడ్డి కిలో బంగారం విరాళం నిమిత్తం

Published : 03 Dec 2021 05:46 IST

మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందజేస్తున్న ప్రతాప్‌రెడ్డి, దినేష్‌రెడ్డి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: యాదాద్రిలో స్వర్ణగోపుర నిర్మాణానికి జూబ్లీహిల్స్‌కు చెందిన జీవీపీఆర్‌ మినరల్స్‌, వీరభద్ర మినరల్స్‌ అండ్‌ గ్రానైట్స్‌ ఎండీ జీవీ ప్రతాప్‌రెడ్డి, ఆయన తనయుడు, సంస్థ డైరెక్టర్‌ దినేష్‌రెడ్డి కిలో బంగారం విరాళం నిమిత్తం రూ.50 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు గురువారం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో యాదాద్రి ఆలయం స్వర్ణమయంగా మారుతోందని, ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో తామూ పాలుపంచుకోవాలనే ఆలోచనతో విరాళం అందించినట్లు వారు తెలపగా.. కేటీఆర్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని