అయిదేళ్లలో 300 శాతంపెరిగిన ధాన్యం సేకరణ: అర్వింద్‌

తెలంగాణ నుంచి గత అయిదేళ్లలో ధాన్యం సేకరణ 300% పెరిగిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. లోక్‌సభలో కేంద్ర మంత్రులు ఇచ్చిన సమాధానాలతో అది స్పష్టమైందన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం

Published : 03 Dec 2021 05:45 IST

తెలంగాణ నుంచి గత అయిదేళ్లలో ధాన్యం సేకరణ 300% పెరిగిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. లోక్‌సభలో కేంద్ర మంత్రులు ఇచ్చిన సమాధానాలతో అది స్పష్టమైందన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ సూచనలతో తెరాస ఎంపీలంతా రెండు రోజులుగా పార్లమెంట్‌లో రభస చేస్తున్నారని మండిపడ్డారు. సభలో ఎంపీ సంజయ్‌ మాట్లాడగానే వారంతా సభ నుంచి పారిపోయారన్నారు. తెరాస ఎంపీలు  సీఎం ఇంటి ఎదుట ఆందోళన చేయాలని సూచించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును భాజపా వ్యతిరేకిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని