తెలుగు వర్సిటీ కోర్సుల్లోనేరుగా ప్రవేశాలు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వివిధ కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తోంది. హైదరాబాద్‌తో పాటు రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం వర్సిటీ ప్రాంగణాల్లో మిగిలిన సీట్లలో నేరుగా చేరేందుకు వీలుంది

Published : 03 Dec 2021 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, నారాయణగూడ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వివిధ కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తోంది. హైదరాబాద్‌తో పాటు రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం వర్సిటీ ప్రాంగణాల్లో మిగిలిన సీట్లలో నేరుగా చేరేందుకు వీలుంది. ఎంఎఫ్‌ఏ(చిత్రలేఖనం, శిల్పకళలు), ఎంఏ అప్లయిడ్‌ లింగ్విస్టిక్స్‌, ఎంఏ సంగీతం, ఎంపీఏ నృత్యం, థియేటర్‌ ఆర్ట్స్‌, జానపద కళలు, ఎంఏ తెలుగు(రాజమండ్రి ప్రాంగణం), ఎంపీఏ నృత్యం(కూచిపూడి ప్రాంగణం), ఎంఏ చరిత్ర(శ్రీశైలం), పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో మిగిలిన సీట్లలో చేరాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ కేంద్రీయ ప్రవేశాల కమిటీ సంచాలకులు కోట్ల హనుమంతరావు తెలిపారు. ‘రిజిస్ట్రార్‌, పీఎస్‌ తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్‌’ పేరిట తీసిన రూ.600 డీడీతో కలిపి ఈ నెల 7 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని