పైరును చూసి గుండె తరుక్కుపోయింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం కొత్త అంజనాపురానికి చెందిన రైతు సామినేని రామారావు గురువారం తన ఆరెకరాల మిరప తోటను ట్రాక్టర్‌తో దున్నించారు. ఇప్పటివరకు రూ.10 లక్షల పెట్టుబడి పెట్టానని..

Published : 03 Dec 2021 05:45 IST

ద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం కొత్త అంజనాపురానికి చెందిన రైతు సామినేని రామారావు గురువారం తన ఆరెకరాల మిరప తోటను ట్రాక్టర్‌తో దున్నించారు. ఇప్పటివరకు రూ.10 లక్షల పెట్టుబడి పెట్టానని.. మొక్కలు వేసి రెండు నెలలు దాటినా పూత, కాత లేదని వాపోయారు. పైరు చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతోందని.. మనోవేదనతో ఏం జరుగుతుందోనన్న భయంతో తోట తొలగించానని ఆవేదన చెందారు.

-న్యూస్‌టుడే, సుజాతనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని