శ్రీవారి దర్శన టికెట్లపై రీషెడ్యూల్‌ సదుపాయం

తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబరు 18 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులు తమ దర్శన తేదీని రీషెడ్యూల్‌ చేసుకునే

Published : 04 Dec 2021 05:04 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబరు 18 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులు తమ దర్శన తేదీని రీషెడ్యూల్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించామని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఆయా తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేకపోయినవారు ఆరునెలల్లోపు దర్శన స్లాట్లను రీషెడ్యూల్‌ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని