గురుకుల విద్యార్థినులకు అస్వస్థత

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కరీంనగర్‌ జిల్లా

Published : 04 Dec 2021 05:24 IST

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌, చైతన్యపురి, చొప్పదండి, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి గురుకులంలో ఉంటున్న విద్యార్థినుల్లో కొంతమంది మధ్యాహ్నం మూడుగంటలకు కడుపునొప్పిగా ఉందని, కళ్లుతిరుగుతున్నాయంటూ వాంతులు చేసుకున్నారు. గురుకులంలో 400కు పైగా విద్యార్థులుండగా సుమారు వంద మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్న 69 మందిని కరీంనగర్‌లోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారిని వైద్యులు పరీక్షించి పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న 11 మందిని చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని