గంటలో నివేదిక మార్చి వేధించారు!
లండన్ నుంచి బ్రిటీష్ ఎయిర్వేస్లో హైదరాబాద్ వచ్చిన ఓ మహిళకు నగరంలో చేదు అనుభవం ఎదురైంది. ఒమిక్రాన్ అనుమానంతో పోలీసులు, ఇతర సిబ్బంది తనను వేధించినట్లు ఆమె పేర్కొన్నారు. తొలుత కరోనా
యూకే నుంచి వచ్చిన ఒమిక్రాన్ అనుమానిత మహిళ ఆవేదన
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: లండన్ నుంచి బ్రిటీష్ ఎయిర్వేస్లో హైదరాబాద్ వచ్చిన ఓ మహిళకు నగరంలో చేదు అనుభవం ఎదురైంది. ఒమిక్రాన్ అనుమానంతో పోలీసులు, ఇతర సిబ్బంది తనను వేధించినట్లు ఆమె పేర్కొన్నారు. తొలుత కరోనా నెగిటివ్ అని, గంటలోనే పాజిటివ్ అని చెప్పి.. ఇంట్లోకి అడుగుపెట్టనీయకుండా బెదిరించారని వాపోయారు. యంత్రాంగం తప్పులకు తాను, తన కుటుంబం తీవ్ర మనోవ్యథను ఎదుర్కొంటున్నట్లు ఆ మహిళ ‘ఈనాడు’కు తెలిపారు.
అయిదేళ్ల పాపతో గంటల నిరీక్షణ
‘‘లండన్ విమానాశ్రయంలో కొవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ ధ్రువీకరణ పత్రం చూపినా.. పరీక్షలన్నీ చేసి నాలుగు గంటలు ఆలస్యంగా విమానం ఎక్కించారు. 5 ఏళ్ల పాపతో డిసెంబరు 1న ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో దిగా. ఇక్కడా పరీక్షలు చేయాలన్నారు. దాదాపు 200 మందిని నిబంధనలు పాటించకుండా ఒక వరుసలో గంటల తరబడి నిలబెట్టారు. 45 నిమిషాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం కావాలంటే రూ.4,500 కట్టాలన్నారు. అప్పటికే గంటల నిరీక్షణ, పాపకూ ఇబ్బందిగా ఉండటంతో ఆ మొత్తం చెల్లించా. 2 గంటలకు నెగిటివ్ అని చెప్పారు. పాపను తీసుకొని జీడిమెట్లలోని ఇంటికి బయల్దేరా. గంట తర్వాత పాజిటివ్ అంటూ ఇంకో మెయిల్ పంపారు. ఇంటికి వచ్చేసరికి పోలీసులు మోహరించారు. ఓ పోలీసు నాతో ఫోన్లో ‘ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోవాలని’ దురుసుగా మాట్లాడారు. టాయిలెట్కూ వెళ్లనివ్వకుండా అంబులెన్సులో టిమ్స్కి తరలించారు. ఇక్కడ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అక్కడే మరోసారి పరీక్ష చేసినా నెగిటివ్ వచ్చింది. అయినా ప్రసార మాధ్యమాల్లో మా చిత్రాలు, కుటుంబం వివరాలు ప్రచురిస్తున్నారు. యూకేలో ఉన్న నా భర్త, ఇక్కడ చిన్న పాప, కుటుంబం ఎంత మనోవ్యథ అనుభవిస్తుందో మాటల్లో చెప్పలేను. ఎవరో చేసిన తప్పులకు మేం శిక్ష అనుభవించాలా?’’ అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!