బుద్ధవనంలో కొత్త రాతియుగం ఆనవాళ్ల్లు
నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో కొత్త రాతియుగానికి సంబంధించిన ఆనవాళ్ల్లు లభ్యమైనట్లు పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బుద్ధవనంలో పాదచారుల
పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
బుద్ధవనంలో లభ్యమైన ఆనవాళ్లను పరిశీలిస్తున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి,
బుద్ధవనం ప్రత్యేకాధికారి లక్ష్మయ్య
నాగార్జునసాగర్, న్యూస్టుడే: నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో కొత్త రాతియుగానికి సంబంధించిన ఆనవాళ్ల్లు లభ్యమైనట్లు పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బుద్ధవనంలో పాదచారుల దారి కోసం స్థలాన్ని పరిశీలిస్తుండగా నాలుగు చోట్ల.. కొత్త రాతియుగంలో వాడిన సూక్ష్మపనిముట్లను, గొడ్డళ్లను సానతీసే సందర్భంలో ఏర్పడిన గుంతలు వెలుగుచూశాయని ఆయన ఆదివారం వెల్లడించారు. ఆదిమానవులు ఆహార సంపాదన కోసం ఈ ప్రాంతాన్ని వినియోగించి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ట్రాకింగ్ పాత్ ద్వారా పురావస్తు పర్యాటకాభివృద్ధి కూడా జరుగుతుందని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ సూదన్రెడ్డి, పర్యాటక సంస్థ ఎస్ఈ క్రాంతిబాబు తదితరులు పాల్గొన్నారు.
\
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా