నేడు ఎన్టాగీ భేటీ
రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి కొవిడ్ టీకా ‘అదనపు’ డోసు ఇచ్చే అంశాన్ని ఇమ్యునైజేషన్పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టాగీ) పరిశీలించనుంది. ఈమేరకు సోమవారం
కొవిడ్ ‘అదనపు’ డోసుపై చర్చ
దిల్లీ: రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి కొవిడ్ టీకా ‘అదనపు’ డోసు ఇచ్చే అంశాన్ని ఇమ్యునైజేషన్పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టాగీ) పరిశీలించనుంది. ఈమేరకు సోమవారం నిర్వహించనున్న సమావేశంలో దీనిపై చర్చిస్తారని అధికారులు తెలిపారు. అధికార వర్గాల సమాచారం మేరకు.. అదనపు డోసుకు, బూస్టర్ డోసుకు మధ్య తేడా ఉంది. ముందు జరిగిన వ్యాక్సినేషన్ వల్ల కలిగే రోగ నిరోధక స్పందన కొంత తగ్గినట్లు భావించినప్పుడు తర్వాత నిర్దేశించిన సమయంలో అందరికీ ఇచ్చేదే బూస్టర్ డోసు. అదే రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, మందులతో రోగనిరోధక శక్తిని తగ్గించినవారిలో ముందు ఇచ్చిన టీకాలు ఇన్ఫెక్షన్ నుంచి తగినంత రక్షణ కల్పించనప్పుడు అలాంటివారికి మాత్రమే అదనపు డోసు ఇస్తారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యయనాలు కొనసాగుతున్నందున బూస్టర్ డోసు అంశం అజెండాలో లేదు. అదనపు డోసుకు సంబంధించి మాత్రమే ఎన్టాగీ సమావేశంలో చర్చకు రానుంది’’ అని అధికార వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..