త్వరలో కొత్త క్రీడా విధానం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణలో త్వరలో కొత్త క్రీడా విధానం అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మహారాష్ట్రలో

Published : 06 Dec 2021 05:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో కొత్త క్రీడా విధానం అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి 34వ సీనియర్‌ పురుషుల, జూనియర్‌, సబ్‌ జూనియర్‌ ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ పోటీల్లో బంగారు, రజత పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారుల బృందాన్ని ఆయన ఆదివారం హైదరాబాద్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త క్రీడా విధానం ద్వారా క్రీడలకు మరింత ఊతమివ్వనున్నామని తెలిపారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంలో దీని విధివిధానాలపై చర్చించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని