
శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్న్ స్కాలర్షిప్ పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: శ్రీచైతన్య - ఇన్ఫినిటీ లెర్న్ దేశంలోనే అతిపెద్ద స్కాలర్షిప్ పరీక్షకు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించింది. కార్యక్రమ డైరెక్టర్ సుష్మ బొప్పన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 18, 19 తేదీల్లో ఆన్లైన్లో, 19 వ తేదీన ఆఫ్లైన్లో నిర్వహించే ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు 3 నుంచి 12వ తరగతుల్లో చేరవచ్చని తెలిపారు. దాదాపు రూ.వెయ్యి కోట్ల ఫీజు రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. పాల్గొనాలనుకునే వారు ఆన్లైన్లో www.infinitylearn.com/score లో రూ.125 ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఫైనల్ పరీక్ష శ్రీ చైతన్య క్యాంపస్లలో ఆన్లైన్లో జరుగుతుందన్నారు. వివరాల కోసం www.infinitylearn.com/score లేదా 040-71045046 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.