TS EAMCET: బీఎస్సీ నర్సింగ్ కోర్సుకూ ఎంసెట్!
రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను వచ్చే విద్యాసంవత్సరం(2022-23) ఎంసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ మార్కులను బట్టి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో....
వచ్చే ఏడాది నుంచి ప్రవేశ పరీక్ష తప్పనిసరి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను వచ్చే విద్యాసంవత్సరం(2022-23) ఎంసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ మార్కులను బట్టి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సీట్లను కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం(2021-22) నుంచి నీట్ ఆధారంగా నర్సింగ్ సీట్లు కేటాయించవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనిద్వారా కాకున్నా ఏదో ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని భారతీయ నర్సింగ్ మండలి(ఐఎన్సీ) రాష్ట్రాలను ఆదేశించింది. కానీ ఇందుకు ఈఏడాదికి కాళోజీ వర్సిటీ మినహాయింపు పొందింది. ప్రస్తుత సంవత్సరానికి ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు జరుపుతోంది. ఈక్రమంలో ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలని భావిస్తోంది.
ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో ఆ వర్సిటీ ఉపకులపతి బి.కరుణాకర్రెడ్డి దీన్ని ప్రతిపాదించారు. త్వరలో రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్, ఆయా కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి నీట్, ఎంసెట్లలో.. దేని ర్యాంకు ఆధారంగా నర్సింగ్ సీట్లను భర్తీ చేయాలన్న దానిపై అభిప్రాయాలను తీసుకుంటామని కాళోజీ వర్సిటీ ఉపకులపతి కరుణాకర్రెడ్డి అన్నారు. ఎంసెట్ అయితే మన విద్యార్థులకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. లిఖితపూర్వకంగా ప్రతిపాదన పంపిస్తే ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి చెప్పినట్లు సమాచారం. కాగా రాష్ట్రంలోని 87 నర్సింగ్ కళాశాలల్లో, సుమారు 5 వేల వరకు సీట్లున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా