APSRTC: ఏపీ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు హైదరాబాద్లో ఆసుపత్రి
ఏపీఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు హైదరాబాద్లో ఉచిత వైద్యంతోపాటు మందులు అందనున్నాయి. హైదరాబాద్ తార్నాకలో ప్రస్తుతమున్న ఆర్టీసీ ఆస్పత్రిలోనే కొత్తగా ప్రత్యేక విభాగాన్ని ఏపీ ఆర్టీసీ ఎం.డి. ద్వారకా తిరుమలరావు శనివారం ప్రారంభించారు.
ఈనాడు డిజిటల్- హైదరాబాద్: ఏపీఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు హైదరాబాద్లో ఉచిత వైద్యంతోపాటు మందులు అందనున్నాయి. హైదరాబాద్ తార్నాకలో ప్రస్తుతమున్న ఆర్టీసీ ఆస్పత్రిలోనే కొత్తగా ప్రత్యేక విభాగాన్ని ఏపీ ఆర్టీసీ ఎం.డి. ద్వారకా తిరుమలరావు శనివారం ప్రారంభించారు. ఇక్కడ సీనియర్ వైద్యాధికారి, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చే సుమారు రెండు వేల మంది డ్రైవర్లు, కండక్టర్లకు సైతం అత్యవసర సమయాల్లో ఇక్కడ వైద్యం అందిస్తారు. అవసరమైతే స్పెషాలిటీ ఆసుపత్రులకు సిఫారసు చేసే అధికారం వైద్యాధికారికి ఉంటుంది. కార్యక్రమంలో ఈడీ కోటేశ్వరరావు, ఆర్టీసీ ముఖ్య వైద్యాధికారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి