17నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ తరగతులను ఈ నెల 17 నుంచి 22 వరకూ(తొలిదశలో) ఆన్లైన్లో నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు, నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్ ఎక్స్టర్నల్ పరీక్షలను థియరీ పరీక్షల తర్వాత నిర్వహించనుంది
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ తరగతులను ఈ నెల 17 నుంచి 22 వరకూ(తొలిదశలో) ఆన్లైన్లో నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు, నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్ ఎక్స్టర్నల్ పరీక్షలను థియరీ పరీక్షల తర్వాత నిర్వహించనుంది. మూడు, నాలుగు ఏడాది చదివే విద్యార్థులకు మిడ్టర్మ్ పరీక్షలు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నిర్వహించుకునేలా కళాశాలలకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు జేఎన్టీయూ ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. కళాశాలలకు ఆన్లైన్ తరగతులకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఫ్యాకల్టీని యాజమాన్యాలు యథావిధిగా కొనసాగించాలని, విధుల నుంచి తొలగిస్తే ఆందోళనకు దిగుతామని తెలంగాణ సాంకేతిక, ప్రొఫెషనల్ కళాశాలల ఉద్యోగుల సంఘం వి.బాలకృష్ణారెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె