నేడు ఒక మాదిరి వర్షాలు!

రాష్ట్రంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకూ పలు చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా జాజిరెడ్డి గూడెం (సూర్యాపేట జిల్లా)లో 6, డోర్నకల్‌(మహబూబాబాద్‌)లో 5, చిల్కూరు (సూర్యాపేట)లో 4, మల్యాలపల్లి (పెద్దపల్లి)లో 4, జన్నారం (మంచిర్యాల)లో

Published : 15 Jan 2022 06:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకూ పలు చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా జాజిరెడ్డి గూడెం (సూర్యాపేట జిల్లా)లో 6, డోర్నకల్‌(మహబూబాబాద్‌)లో 5, చిల్కూరు (సూర్యాపేట)లో 4, మల్యాలపల్లి (పెద్దపల్లి)లో 4, జన్నారం (మంచిర్యాల)లో 3.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 67 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కర్ణాటక ఉత్తర ప్రాంతం నుంచి ఒడిశా వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో శనివారం తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 5 డిగ్రీల వరకూ పెరగడంతో చలి తీవ్రత తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని