ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు లేనట్లే?
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం పక్కనపెట్టింది. గత నెల 9వ తేదీన విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం పక్కనపెట్టింది. గత నెల 9వ తేదీన విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్ ఉద్యోగులకు మాదిరిగానే ఆచార్యులకు పదవీ విరమణ వయసును పెంచేందుకు అంగీకరించారు. ఎంత పెంచాలన్న దానిపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని, ప్రతిపాదనలు పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు ఉద్యోగులతో సమానంగా 61, మూడేళ్లు పెంచి 63, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మాదిరిగా 65...అనే మూడు రకాల ప్రతిపాదనలను విద్యాశాఖ సమర్పించినట్లు తెలిసింది. అయితే మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏమి నిర్ణయం వస్తుందో అని ఎదురుచూసిన సీనియర్ ఆచార్యులు నిరాశకు గురయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు