టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో మార్పులు

టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులు చేసినట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలోని బస్‌ భవన్‌లో జాతీయ జెండాను ఎగరేసిన అనంతరం ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌లు పోర్టల్‌  

Published : 27 Jan 2022 05:08 IST

రాంనగర్‌, న్యూస్‌టుడే: టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులు చేసినట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలోని బస్‌ భవన్‌లో జాతీయ జెండాను ఎగరేసిన అనంతరం ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌లు పోర్టల్‌  tsrtc.telangana.gov.inను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులు సులభంగా వినియోగించుకునేలా పాత పోర్టల్‌లో మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. కొత్త వెబ్‌సైట్‌ను సందర్శించి ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని