
ఆహ్లాదం.. వైద్యం.. ఆరోగ్యం!
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పిల్లల వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఆసుపత్రిలో ఇప్పటికే పిల్లల కోసం 40 పడకలతో కూడిన వార్డు అందుబాటులో ఉండగా.. కొత్త భవనం రెండో అంతస్తులో రూ.30లక్షల వెచ్చించి 12 పడకల ఐసీయూ, 30 పడకల ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన వార్డును ఏర్పాటు చేశారు. గోడలపై అలరించే కార్టూన్ బొమ్మలతో ఆహ్లాదకర వాతావరణంలో వార్డు అందుబాటులోకి రావడంతో ఆసుపత్రికి వచ్చే చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు లభించనున్నాయి.
- న్యూస్టుడే, చైతన్యపురి(కరీంనగర్)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.