‘పది’ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

పదో తరగతి పరీక్షల ఫీజును ఆలస్య రుసుం లేకుండా చెల్లించే గడువును ఫిబ్రవరి 14వ తేదీ వరకు పెంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్సెస్సీ బోర్డు) సంచాలకుడు కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 29 Jan 2022 04:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫీజును ఆలస్య రుసుం లేకుండా చెల్లించే గడువును ఫిబ్రవరి 14వ తేదీ వరకు పెంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్సెస్సీ బోర్డు) సంచాలకుడు కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇచ్చిన గడువు శనివారం(ఈ నెల 29)తో ముగియనుండటంతో పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 14వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని