Telangana News: రేపటి నుంచే కొత్త మార్కెట్ విలువలు..నేడు కార్డ్లో మార్పులు
రాష్ట్రంలో మంగళవారం నుంచి పెరిగిన మార్కెట్ విలువల మేరకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. కొత్త మార్కెట్ విలువల అమలుకు వీలుగా సోమవారం స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం నుంచి పెరిగిన మార్కెట్ విలువల మేరకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. కొత్త మార్కెట్ విలువల అమలుకు వీలుగా సోమవారం స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనుంది. కొత్త మార్కెట్ విలువల ప్రాతిపదికగా రిజిస్ట్రేషన్ల సాంకేతిక వ్యవస్థ అయిన కార్డ్ విధానంలో మార్పులు చేయనున్నారు. ధరణి వెబ్సైట్లోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. సోమవారం రాత్రికి ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన సాంకేతిక విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. మంగళవారం నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం గతంలో ఉన్నట్లే 7.5 శాతం ఛార్జీలతో రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.
రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు
గత ఏడాది జులై 22న పెరిగిన మార్కెట్ విలువల ప్రకారం రిజిస్ట్రేషన్లకు సోమవారం ఆఖరు రోజు కావడంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఆ శాఖ భావిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి, నల్గొండ, షాద్నగర్, మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్ సహా ప్రధాన పట్టణాల్లోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్లు, సబ్రిజిస్ట్రార్లను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్