30 మంది ఉంటే కాలనీకే బస్సు.. శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు

శివరాత్రి సందర్భంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు 30 మంది ఒక బృందంగా ఏర్పడితే వారి కాలనీకే ప్రత్యేక బస్సు పంపుతామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంతోపాటు

Updated : 27 Feb 2022 09:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: శివరాత్రి సందర్భంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు 30 మంది ఒక బృందంగా ఏర్పడితే వారి కాలనీకే ప్రత్యేక బస్సు పంపుతామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికీ ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం సమీప ఆర్టీసీ డిపో మేనేజరును గానీ, ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ 040-30102829, 040-68153333 నంబర్లలోగానీ సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని