నాటి సీఐల పదోన్నతులను.. ఒకే సామాజిక వర్గం వారికి ఇచ్చారనడంలో నిజం లేదు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించారనే విషయంలో వాస్తవం లేదని వైకాపా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ జాబితాలో ఓసీలతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలూ ఉన్నారని
ఏపీలో తెదేపా హయాంలో పదోన్నతులపై తేల్చి చెప్పిన వైకాపా ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించారనే విషయంలో వాస్తవం లేదని వైకాపా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ జాబితాలో ఓసీలతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలూ ఉన్నారని గురువారం శాసనసభకు ఇచ్చిన సమాధానంలో వెల్లడించింది. ‘2019 ఎన్నికలకు ముందు ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పదోన్నతి కల్పించారనే విషయం వాస్తవమేనా?’ అని తెదేపా ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి తదితరుల ప్రశ్నకు హోం మంత్రి సుచరిత అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. 2014-15, 2015-16 ప్యానెల్ సంవత్సరాలకు తాత్కాలిక ప్రాతిపదికన ప్రమోట్ అయిన 35 మంది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ల జాబితాను సమాధానానికి జత చేశారు. పదోన్నతులు పొందిన వారిలో 15 మంది ఓసీలు, 12 మంది బీసీలు, అయిదుగురు ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు ఉన్నారని వివరించారు. 2016-17, 2017-18 ప్యానెల్ సంవత్సరాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రమోట్ అయిన 36 మంది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు జాబితానూ దీనికి జత చేశారు. డీఎస్పీలుగా ప్రమోట్ అయిన 36 మందిలో 17 మంది ఓసీలు, 12 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఎస్టీ ఒకరు ఉన్నారని తెలిపారు.
బురదజల్లిన జగన్రెడ్డే నిజాన్ని అంగీకరించారు: తెదేపా నేతలు
ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పించారంటూ ఎన్నికలకు ముందు జగన్ చేసిన ఆరోపణలు నిజం కావనేది ఆయన ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతోనే తేట తెల్లమైందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తదితర తెదేపా నేతలు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి..సస్పెండ్ చేసిన అధికారులు
-
ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
-
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్కు పోలింగ్ సిబ్బంది రెడీ!