Telangana News: 15 నిమిషాలు ఆలస్యమైనా ప్రాక్టికల్స్కు అనుమతి
రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగే ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించవచ్చని, ఆ తర్వాత లోపలికి రానివ్వొద్దని ఇంటర్బోర్డు కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జలీల్ ఆదేశాలు జారీ చేశారు.
ఇంటర్ బోర్డు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగే ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించవచ్చని, ఆ తర్వాత లోపలికి రానివ్వొద్దని ఇంటర్బోర్డు కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జలీల్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు చదివే కళాశాలల్లో రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రయోగ పరీక్షలు జరుపుతారు. ఒక కళాశాలలోని విద్యార్థుల్లో 25 శాతం మంది కంటే 30కి 30 మార్కులు వచ్చిన వారి, 27-30 మార్కులు వచ్చిన వారి జవాబుపత్రాలను కూడా తాము మరోసారి పునఃపరిశీలన చేస్తామని స్పష్టం చేశారు. ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేయకుంటే ఆ కళాశాలల ప్రిన్సిపాళ్లు/యాజమాన్యాలకు రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ‘‘విద్యార్థులకు ఎగ్జామినర్లు వేసిన మార్కులను అదేరోజు రాత్రి 8 గంటలలోపు ఆన్లైన్లో బోర్డుకు పంపాలి. జాగ్రఫీ విద్యార్థులకు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రయోగ పరీక్షలు జరుగుతాయి. ఆదివారం నుంచి ఆన్లైన్లో ప్రాక్టికల్్ పరీక్షల హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి’’ అని ఇంటర్బోర్డు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!