Telangana News: 3 కి.మీ. పైపులు వేసి.. రైతు భగీరథ ప్రయత్నం
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ కనిష్ఠ స్థాయికి తగ్గడంతో 35 రోజుల కిందట కల్వకుర్తి ఎత్తిపోతల(కేఎల్ఐ) నుంచి సాగునీటి విడుదల నిలిపేశారు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నీటితడి అందక ఎండుతున్న పంటలను
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ కనిష్ఠ స్థాయికి తగ్గడంతో 35 రోజుల కిందట కల్వకుర్తి ఎత్తిపోతల(కేఎల్ఐ) నుంచి సాగునీటి విడుదల నిలిపేశారు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నీటితడి అందక ఎండుతున్న పంటలను బతికించుకునేందుకు భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన రైతు కర్నె రాములు కేఎల్ఐ కాలువ వెంట వివిధ ప్రాంతాల్లో 8 ఎకరాలు సాగు చేస్తున్నారు. వడ్డీకి రూ.3 లక్షల అప్పు తెచ్చి మిర్చి, మక్కలు, వరి పంటలు వేశారు. వాటిని కాపాడుకునేందుకు ఓ బోరును నెల రోజులకు రూ.15 వేలకు అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి తన పొలాలకు 20 అడుగుల పొడవున్న 140 పైపులు (2800 అడుగుల పొడవు) ఏర్పాటు చేసి నీటి తడులు అందిస్తున్నారు. ఇంతచేస్తున్నా వరి పంటకు నీరందక ఎండుముఖం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు చేతికి రావడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని తెలిపారు. బోరు ఎండకుండా నీరు వస్తేనే పంటలు చేతికందే అవకాశం ఉంటుందని చెప్పారు.
- ఈనాడు, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు