Telangana News: మగాళ్ల పెళ్లి.. ఠాణాకెళ్లి లొల్లి!

అవును..ఇది మగాళ్ల మధ్య జరిగిన పెళ్లి..! తాగిన మైకంలో ఒకరు మరొకరితో తాళి కట్టించుకున్నారు. ఆపై కాపురానికి వచ్చానంటూ తాళి కట్టిన యువకుడి ఇంటి ముందు వాలిపోయాడు.. అతని తల్లిదండ్రులు మందలించి పంపినా వినకుండా పోలీసులను ఆశ్రయించాడు ఆ వ్యక్తి.

Updated : 06 Apr 2022 06:46 IST

అవును..ఇది మగాళ్ల మధ్య జరిగిన పెళ్లి..! తాగిన మైకంలో ఒకరు మరొకరితో తాళి కట్టించుకున్నారు. ఆపై కాపురానికి వచ్చానంటూ తాళి కట్టిన యువకుడి ఇంటి ముందు వాలిపోయాడు.. అతని తల్లిదండ్రులు మందలించి పంపినా వినకుండా పోలీసులను ఆశ్రయించాడు ఆ వ్యక్తి. రూ.లక్ష ఇస్తే కానీ ఫిర్యాదు వాపసు తీసుకోనని మొండికేశాడు.. ఈ అనూహ్య ఘటన మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌లో మంగళవారం వెలుగుచూసింది. ఇందులోని పాత్రధారుల్లో ఒకరు సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడు.. కాగా, రెండో వ్యక్తి చిలప్‌చెడ్‌ మండలం చండూర్‌కి చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవరు. కొల్చారం మండలం దుంపలకుంటలోని ఓ కల్లు దుకాణంలో ఏర్పడిన పరిచయం.. ఈ నెల 1న తాగిన మైకంలో ఉన్న చండూర్‌ యువకుడితో తాళి కట్టించుకునే వరకూ పోయింది. మొత్తంగా పోలీసులు, గ్రామపెద్దలు ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులను పిలిపించి చర్చించారు. తుదకు.. చండూర్‌ యువకుడి కుటుంబీకులతో రూ.10వేలు ఇప్పించడంతో కథ సుఖాంతమైంది. జోగిపేట యువకుడు ఫిర్యాదు వాపసు తీసుకున్నట్లు చిలప్‌చెడ్‌ ఠాణా ఎస్‌ఐ మహ్మద్‌గౌస్‌ తెలిపారు. 

- న్యూస్‌టుడే, చిలప్‌చెడ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని