Telangana News: కలెక్టర్ టెన్నిస్ ఆట కోసం 21 మంది వీఆర్ఏలకు విధులు!
కలెక్టర్ టెన్నిస్ కోర్టుకు వచ్చినప్పుడు వీఆర్ఏలు విధుల్లో ఉండాలంటూ తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ....
చర్చనీయాంశమైన నిర్మల్ అర్బన్ తహసీల్దార్ ఉత్తర్వులు
ఈటీవీ- ఆదిలాబాద్: కలెక్టర్ టెన్నిస్ కోర్టుకు వచ్చినప్పుడు వీఆర్ఏలు విధుల్లో ఉండాలంటూ తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రోజూ సాయంత్రం నిర్మల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సహచర అధికారులతో కలిసి టెన్నిస్ ఆడతారు. ఈ నేపథ్యంలో రోజూ ముగ్గురు చొప్పున వారానికి 21 మంది వీఆర్ఏలకు తహసీల్దార్ శివప్రసాద్ ప్రత్యేక విధులు కేటాయించారు. వీరిపై పర్యవేక్షణకు మరో ఏడుగురు వీఆర్వోలను నియమిస్తూ సోమవారం డీ/777/2020 నంబరుతో ప్రత్యేక ప్రొసీడింగ్ జారీ చేశారు. వారందరూ రోజూ సాయంత్రం 5.30 గంటలకు ఠంఛనుగా తహసీల్దార్ కార్యాలయంలోని టెన్నిస్ కోర్టుకు రావాలని ఆదేశించారు. వారి హాజరును పరిశీలించాలంటూ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్కూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై తహసీల్దార్ శివప్రసాద్ను ‘ఈనాడు’ ఫోన్లో సంప్రదించగా.. గతంలో పనిచేసిన తహసీల్దార్ చేపట్టిన విధానాన్నే తాను కొనసాగిస్తున్నానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్