భాగవతామృతానికి డిజిటల్ తళుకు
భాగవతామృతాన్ని కమ్మనైన తెలుగు భాషలో అందించిన బమ్మెర పోతన జీవిత విశేషాలు, భాగవత పద్యాలను ఇక నుంచి డిజిటల్ తెరలపై చూడొచ్చు. అందుకు వరంగల్లోని పోతన విజ్ఞాన పీఠం వేదిక కానుంది. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన పోతన విజ్ఞాన పీఠంలో..
తాకే తెరలపై పోతన జీవిత విశేషాలు
ఈనాడు, వరంగల్: భాగవతామృతాన్ని కమ్మనైన తెలుగు భాషలో అందించిన బమ్మెర పోతన జీవిత విశేషాలు, భాగవత పద్యాలను ఇక నుంచి డిజిటల్ తెరలపై చూడొచ్చు. అందుకు వరంగల్లోని పోతన విజ్ఞాన పీఠం వేదిక కానుంది. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన పోతన విజ్ఞాన పీఠంలో.. వరంగల్ మహానగరపాలక సంస్థ రూ.కోటి ప్రత్యేక నిధులతో ‘పోతన డిజిటల్ ప్రదర్శనశాల’ను తీర్చిదిద్దింది. ఇందులో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసింది. సందర్శకులు భాగవతం విశేషాలు, పద్యాలు, పోతన జీవిత విశేషాలు, ఆయన వంశవృక్షాన్ని ఈ తాకే తెరలను కదుపుతూ వీక్షించొచ్చు. 30 మంది ప్రేక్షకులు కూర్చొని చూసేలా ఓ చిన్నపాటి థియేటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో పోతన సినిమాలు, భాగవత సంబంధిత దృశ్యాలను ప్రదర్శిస్తారు. ఈ నెల 20న ప్రారంభమవనున్న ఈ డిజిటల్ ప్రదర్శనశాల వరంగల్కు అదనపు పర్యాటక ఆకర్షణ కానుంది. మరోవైపు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని పోతన స్వస్థలమైన బమ్మెరలో స్మృతివనాన్ని నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు