Tirumala: సర్వదర్శనం భక్తులకు 4 గంటల్లో శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారిని శనివారం 76,746 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి వారాంతంలో భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని నాలుగు కంపార్ట్మెంట్లలో
తిరుమల, న్యూస్టుడే: తిరుమల శ్రీవారిని శనివారం 76,746 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి వారాంతంలో భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని నాలుగు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. యాత్రికుల సంఖ్య మేరకు నాలుగు గంటల్లో శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. శనివారం రూ.4.62 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 31,574 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
కొవిడ్ అనంతరం సాధారణ పరిస్థితులు: కొవిడ్ వ్యాప్తి తగ్గి.. వేసవి సెలవులు మొదలుకావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. రెండేళ్ల తరువాత తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తితిదే ప్రకటన విడుదల చేసింది. కొవిడ్ సమయంలో కుదించిన సిబ్బందిని తిరిగి ఆయా విభాగాలకు రప్పించి భక్తులకు సేవలు అందిస్తున్నామని తెలిపింది.
అన్యమత చిహ్నాలతో తిరుమలకు చేరుకున్న కారు
అన్యమత చిహ్నాలు కలిగిన కారు తిరుమలకు చేరుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు చేరుకున్నారు. కారుపైన, లోపల అన్యమతానికి చెందిన చిహ్నాలు ఉన్నాయి. తిరుమలకు వచ్చే వాహనాలపై ఉన్న అన్యమత చిహ్నాలను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తొలగించి అనుమతిస్తారు. తనిఖీ కేంద్రం భద్రతా సిబ్బంది వైఫల్యంతో కారు తిరుమలకు చేరుకుంది. తిరుమలలోనూ భద్రతా సిబ్బంది గుర్తించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్