Weather Forecast: సూర్యుడు ఉగ్రరూపం.. నేడూ.. రేపూ జరభద్రం

సూర్యుడు ఉగ్రరూపం దాల్చి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు చెరిగాడు. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌లో 45.7, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవి. మరో పది జిల్లాల్లో 44.8 నుంచి 43.9 డిగ్రీల వరకు నమోదయ్యాయి. రాష్ట్రంలో గురు, శుక్ర వారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

Published : 28 Apr 2022 07:27 IST

జైనద్‌లో 45.7, ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: సూర్యుడు ఉగ్రరూపం దాల్చి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు చెరిగాడు. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌లో 45.7, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవి. మరో పది జిల్లాల్లో 44.8 నుంచి 43.9 డిగ్రీల వరకు నమోదయ్యాయి. రాష్ట్రంలో గురు, శుక్ర వారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని