ఉన్నతాధికారులు ప్రశ్నించారని.. దుస్తులు విప్పేసి ఆర్టీసీ డ్రైవర్ నిరసన
నిజామాబాద్ ఆర్టీసీ డిపో-2లో పనిచేస్తున్న డ్రైవర్ గణేశ్.. శనివారం డీఎం కార్యాలయం వద్ద తన దుస్తులు విప్పేసి నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఆయన 15 ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నారు.
నిజామాబాద్ ఆర్టీసీ డిపో-2లో పనిచేస్తున్న డ్రైవర్ గణేశ్.. శనివారం డీఎం కార్యాలయం వద్ద తన దుస్తులు విప్పేసి నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఆయన 15 ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఇటీవల కేఎంపీఎల్ (మైలేజి) తక్కువ వచ్చిందని ఆయనకు డీఎం కౌన్సెలింగ్ నిర్వహించారు. వారం గడవక ముందే మళ్లీ డీఐ పిలిచి.. కేఎంపీఎల్ తగ్గిందంటూ డీఎంను కలవాలని చెప్పారు. దీంతో గణేశ్ ఆవేదనకు గురై.. తరచూ ఇలా కౌన్సెలింగ్ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. పాత బస్సులతో కేఎంపీఎల్ ఎలా తీసుకురావాలని ప్రశ్నిస్తూ తన దుస్తులు విప్పేసి బయటికొచ్చేశారు. తోటి సిబ్బంది ఆయనను అడ్డుకుని సముదాయించారు. దీనిపై డీఎం వెంకటేశంను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. కౌన్సెలింగ్కు హాజరు కావాలనే బాధతోనే గణేశ్ ఇలా చేశారన్నారు. సంస్థను కాపాడేందుకు అందరం కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
- నిజామాబాద్ అర్బన్, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్