ద్విచక్ర వాహనం ఢీకొని.. వనజీవి రామయ్యకు గాయాలు
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఖమ్మం గ్రామీణ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఖమ్మం గ్రామీణ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రోజూ మాదిరిగానే రహదారుల పక్కన ఉన్న మొక్కలకు నీళ్లు పోసేందుకు ద్విచక్రవాహనంపై ఉదయం ఇంటి నుంచి బయల్దేరారు. రోడ్డు దాటుతుండగా మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో రామయ్య కాలికి తీవ్రంగా, తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కాలికి తీవ్రగాయం కావడంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు.
మంత్రుల పరామర్శ
మంత్రులు హరీశ్రావు, అజయ్కుమార్ రామయ్యతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఆయనకు మెరుగైన వైద్యసేవలందించాలని వారు వైద్యాధికారులను ఆదేశించారు. మరో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి రామయ్య కుమారుడికి ఫోన్ చేసి, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, జోగినపల్లి సంతోష్కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు కూడా రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్చేసి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై రామయ్య కుమారుడు కనకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్