Agriculture: దిగులే దిగుబడి!
వానాకాలం పంటల సాగు చాలామంది రైతులకు నిరాశే మిగిల్చింది. అధిక వర్షాలు, తేమ వల్ల చుట్టుముట్టిన తెగుళ్లతో పంటల దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. డీజిల్, కూలి రేట్లు, యంత్రాల కిరాయిలు
సాగు ఖర్చులు పెరిగి గిట్టుబాటు కాని పంటలు
పత్తి మినహా మిగతా వాటికి ధర, డిమాండు కరవు
కలిసిరాని వానాకాలం సీజన్
మెదక్, కామారెడ్డి జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి
వానాకాలం పంటల సాగు చాలామంది రైతులకు నిరాశే మిగిల్చింది. అధిక వర్షాలు, తేమ వల్ల చుట్టుముట్టిన తెగుళ్లతో పంటల దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. డీజిల్, కూలి రేట్లు, యంత్రాల కిరాయిలు విపరీతంగా పెరగడంతో పంటలు కోసి మార్కెట్లకు తీసుకెళ్లాలన్నా వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం అన్నింటిపైనా తీవ్రంగా పడిందని, సాగు ఖర్చులు బాగా పెరిగాయని చెప్పారు. సాగు ఖర్చులు, మార్కెట్లలో వాటికి లభిస్తున్న ధరలపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలనలో రైతులు తమ కష్టాలు వివరించారు. ‘‘సాధారణంగా వాతావరణం అనుకూలిస్తే 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుత సీజన్లో అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా 15 నుంచి 20 క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల బస్తాకు 43 కిలోల ధాన్యం తూకం వేసి తీసుకుంటున్నారని మెదక్ జిల్లా రాజ్పల్లి గ్రామ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు సత్యనారాయణ, యాదగిరి, రాజు, ప్రభాకర్ తదితరులు ‘ఈనాడు’తో ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి ఎదురుచూడలేక, వర్షాలు పడితే తడిసిపోయి ధర తగ్గిస్తారనే భయంతో కొందరు రైతులు బస్తాకు 3 కిలోలు అదనంగా తీసుకున్నా ఫర్వాలేదు త్వరగా తూకం వేసి తీసుకోవాలని కొనుగోలు కేంద్రాల వారిని ప్రాధేయపడుతున్నారు.
పెట్టుబడీ రావడంలేదు
పత్తి పంటకు ధర బాగున్నా దిగుబడి సరిగా రాక నష్టాలే మిగిలినట్లు మెదక్ జిల్లా రైతు రాజయ్య చెప్పారు. పెసర మొత్తం నాశనమైందని వికారాబాద్, జనగామ రైతులు వివరించారు. పత్తి, పెసరకు మద్దతు ధర ఉన్నా పంట దిగుబడి రాక ఏం మిగలడం లేదని, పెట్టుబడి కూడా చేతికి రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకు మాత్రమే కేంద్రాలు తెరుస్తోంది. మిగిలిన పంటలేవీ కొనడం లేదు. వడ్ల కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో అప్పుల చెల్లించాల్సినవారు, సొమ్ము అవసరమైన రైతులు వ్యాపారులిచ్చిన ధరలకు తెగనమ్మకుంటున్నారు. మొక్కజొన్నకు వ్యాపారులు మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు.
కిరాయి భారం
డీజిల్, కూలీ రేట్లు, యంత్రాల కిరాయి గణనీయంగా పెరగడంతో పంట సాగు ఖర్చులు అధికమై ఏమీ మిగలడం లేదని రైతులు తెలిపారు. గతేడాది వరి కోత యంత్రానికి గంటకు రూ.2,000 నుంచి 2,400 వరకూ తీసుకుంటే ఇప్పుడు రూ. 2,500 నుంచి 3,300 దాకా వసూలు చేస్తున్నారు. వరి ధాన్యాన్ని గ్రామంలోనే ఉన్న కొనుగోలు కేంద్రానికి కిలోమీటరు దూరం తీసుకెళ్లినా ట్రాక్టర్ కిరాయి రూ.500 నుంచి 1000 వసూలు చేస్తున్నారు. ఎకరా పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలంటే కనీసం రూ.4 వేల ఖర్చవుతోంది. వరికోతలకు పెరిగిన ఖర్చులు, తరలింపునకు అదనంగా చెల్లిస్తున్నది, తరుగు వంటి వాటిని లెక్కేస్తే రాష్ట్రం మొత్తం మీద రైతులు కోల్పోతున్న సొమ్ము రూ. 2,500 కోట్ల వరకు ఉంటుందని మార్కెటింగ్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు. విత్తనం కొనుగోలు, దుక్కుల నుంచి మొదలుపెడితే సాగుఖర్చులకు తగినంత ఆదాయం వరి రైతులకు రాని మాట వాస్తవమేనని ఆయన చెప్పారు.
ధర పెరిగినా లాభం లేకపోయే
పత్తికి ధర బాగా పెరిగినా ఏం లాభం? నాకు సాగు ఖర్చులు కూడా తిరిగి రాలేదు. రూ.లక్షా 80 వేలు ప్రైవేటు వడ్డీకి, బ్యాంకు నుంచి మరో రూ.60 వేలు అప్పు తెచ్చి 10 ఎకరాల్లో పత్తి సాగుచేశాను. అధిక వర్షాలతో పూత, కాత రాలి, తెగుళ్లు సోకి పంట దెబ్బతింది. ఎకరానికి 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడి ఎకరానికి రూ.35 వేలు దాటింది. క్వింటాకు రూ.8 వేలిచ్చినా నాకు ఇంకా ఎకరానికి రూ.11 వేల చొప్పున 10 ఎకరాలకు రూ.లక్షకు పైగా నష్టమే. పంట లేనందుకే వ్యాపారులు ధరలు పెంచారు.
-బస్తీ నత్తాసింగ్, పత్తి రైతు, ధర్మసాగర్ గ్రామం, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా
ఖర్చులు పెరిగినయ్..
అప్పులు తెచ్చి వరి సాగుచేశాను. సాగు ఖర్చులు బాగా పెరిగాయి. కోత యంత్రానికి గంటకు రూ. 2,700 తీసుకుంటున్నారు. అన్ని ఖర్చులు లెక్కేస్తే ఏమీ మిగలడం లేదు. కూలీల ఖర్చులు భరించలేక మా కుటుంబ సభ్యులమే పనులు చేసుకుంటున్నాం. ఎకరానికి 15 క్వింటాళ్లు కూడా రాలేదు. మద్దతు ధర ఇచ్చినా మాకేం మిగలదు. వ్యాపారులు ఇంకా తక్కువకు అడుగుతున్నారు.
-నల్లపద్మ, గిరిజన మహిళా రైతు రంగంపేట, కొల్చారం మండలం, మెదక్ జిల్లా
మండుటెండలో వృద్ధ రైతు దంపతుల శ్రమ
గడ్డిమోపు కడుతున్న ఈ వృద్ధుని పేరు కిష్టయ్య, ఆయన భార్య లలిత. సంగారెడ్డి జిల్లా దౌలాపూర్ గ్రామంలో 2 ఎకరాల్లో వరి సాగుచేశారు. కూలి ధరలు పెరగడంతో భరించలేక భార్యతో కలసి గడ్డి మోపులు కట్టి మోసుకెళ్తున్నారు. కూలి రోజుకు రూ.300 నుంచి 500 అడుగుతున్నారని, డీజిల్ ధర పెంపు వల్ల ట్రాక్టర్ కిరాయిలు కూడా భారమవడంతో అంత చెల్లించలేక వృద్ధులమైనా తామే పని చేసుకుంటున్నామని ఆ దంపతులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM