Aryan Khan: ఆర్యన్కు బెయిలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు ఎట్టకేలకు కొంత ఊరట లభించింది. బెయిలు కోసం ఆయన చేసిన నిరీక్షణ ఫలించింది. ఎన్నెన్నో మలుపులు,
ఫలించిన షారుక్ తనయుడి నిరీక్షణ
డ్రగ్స్ కేసులో బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట
నేడో రేపో విడుదలయ్యే అవకాశం
అర్బాజ్, మున్మున్లకూ బెయిలు మంజూరు
ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు ఎట్టకేలకు కొంత ఊరట లభించింది. బెయిలు కోసం ఆయన చేసిన నిరీక్షణ ఫలించింది. ఎన్నెన్నో మలుపులు, వివాదాలతో ముందుకు సాగుతున్న ఈ కేసులో ఆర్యన్తో పాటు మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచలకు బాంబే హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. ఇప్పటికే 25 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్.. కోర్టు ఆదేశాల ప్రకారం లాంఛనాలన్నీ పూర్తిచేశాక శుక్రవారం లేదా శనివారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. తాజా పరిణామంతో షారుక్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ముంబయి తీరంలోని నౌకలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటనకు సంబంధించి ఆర్యన్ సహా మొత్తం 20 మందిని ఎన్సీబీ ఈ నెల 3న అరెస్టు చేసింది. షారుక్ కుమారుడు ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఆర్యన్, అర్బాజ్, మున్మున్ల బెయిలు పిటిషన్లపై జస్టిస్ ఎన్.డబ్ల్యూ.సంబ్రే నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. తొలుత ఎన్సీబీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. 23 ఏళ్ల ఆర్యన్ గతంలో వాణిజ్య వినియోగ స్థాయిలో డ్రగ్స్ను సమీకరించినట్లు ఏ ప్రాతిపదికన చెబుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఆయన వాట్సప్ చాట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని సింగ్ పేర్కొన్నారు. నిందితుడి ఫోన్ నుంచి ఎన్సీబీ ఈ మేరకు ఆధారాలు సంపాదించిందన్నారు. నౌకలో 11 మంది మాదకద్రవ్యాలను వాడనున్నట్లు ఎన్సీబీకి సమాచారం అందిందని, వారిలో 8 మంది వద్ద డ్రగ్స్ దొరికాయని చెప్పారు. అర్బాజ్ వద్ద ఉన్న డ్రగ్స్నే ఆర్యన్ నౌకలో తీసుకుని ఉండేవారని పేర్కొన్నారు. వారిద్దరికీ మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులతో సంబంధాలున్నాయని బలంగా వాదించారు. ఆర్యన్ తరచూ డ్రగ్స్ వినియోగిస్తుంటారన్నారు. ప్రస్తుతం ఆయన విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే ముప్పుందని చెప్పారు. తమ అరెస్టు అక్రమమని నిందితులు ఇప్పుడు వాదించడంలో అర్థం లేదన్నారు. మేజిస్ట్రేటు కోర్టు ఇంతకుముందు ఎన్సీబీ కస్టడీకి అప్పగించినప్పుడే దానిపై వారు సవాలు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘డ్రై డే’గా పాటించే అక్టోబరు 2న నిందితులు ఇలాంటి విహార విందును ఏర్పాటుచేసుకోవాల్సింది కాదంటూ సింగ్ కాస్త చమత్కారంతో వ్యాఖ్యానించారు.
పూచీకత్తు ఉండాల్సిందే
అనంతరం ఆర్యన్ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తిరిగి వాదనలను వినిపించారు. నౌకలో ఉన్నవారిలో అర్బాజ్ తప్ప ఇతరులెవరూ ఆర్యన్కు తెలియదని చెప్పారు. డ్రగ్స్కు సంబంధించిన కుట్రలో ఆయన పాత్ర ఉన్నట్టు నిరూపించే సాక్ష్యాధారమేదీ లేదన్నారు. ఆపై జస్టిస్ సంబ్రే మధ్యలో కలుగజేసుకొని.. ‘‘ముగ్గురికీ బెయిలు మంజూరు చేస్తున్నా. సమగ్ర ఉత్తర్వులను రేపు (శుక్రవారం) సాయంత్రానికల్లా జారీ చేస్తా’’ అని పేర్కొన్నారు. డబ్బు చెల్లించి బెయిలు (క్యాష్ బెయిల్) తీసుకునేందుకు ఆర్యన్ తరఫు న్యాయవాదులు అనుమతి కోరగా.. న్యాయమూర్తి నిరాకరించారు. పూచీకత్తు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. బెయిలు మంజూరుకు షరతులను వివరిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేశాక, ఆ లాంఛనాలను పూర్తిచేస్తే.. ఆర్యన్ విడుదలవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా