BJP Meeting: అయిదు రాష్ట్రాల్లోనూ మనదే గెలుపు
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలతో మమేకం కండి
నమ్మకమైన వారధిలా పనిచేయండి
భాజపా జాతీయ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు నరేంద్ర మోదీ దిశానిర్దేశం
ప్రధానిని ప్రశంసిస్తూ కార్యవర్గం తీర్మానం
ప్రధాని మోదీని సత్కరిస్తున్న పార్టీ నేతలు జేపీ నడ్డా, పీయూష్ గోయల్. పక్కన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్
ఈనాడు, దిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దిల్లీలో జరిగిన భాజపా జాతీయ కార్యనిర్వాహక వర్గం సమావేశం ముగింపు సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు-పార్టీకి మధ్య నమ్మకమైన వారధిలా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉందంటే దానికి కారణం... ప్రజలతో కలిసి పనిచేయడమేనని చెప్పారు. సేవ, సంకల్పం, నిబద్ధత అనే విలువలపై ఆధారపడి భాజపా పనిచేస్తోందని, మిగతా పార్టీల్లా కుటుంబం చుట్టూ తిరగదని పరోక్షంగా కాంగ్రెస్పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కొవిడ్ మహమ్మారి సమయంలో దేశాన్ని ప్రధాని నడిపించిన తీరును భాజపా జాతీయ కార్యవర్గం ప్రశంసించింది. 100 కోట్ల టీకాలు దాటడం, 80 కోట్ల ప్రజలకు ఉచితంగా ఆహారం అందించడం.. తదితర అంశాలు ప్రధాని నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని అభిప్రాయపడింది. మోదీని, ఇటీవల భాజపా సాధించిన విజయాలను పొందుపరుస్తూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మద్దతుగా పలువురు ప్రసంగించారు. ఈ తీర్మానం ప్రతిపక్షాలపైనా విమర్శలు చేసింది. కరోనా సమయంలో అవకాశవాద రాజకీయాలకు విపక్షాలు పాల్పడ్డాయని, ట్విటర్ ద్వారా అపోహలు రేకెత్తించే ప్రయత్నం చేశాయని ఆరోపించింది. బెంగాల్లో తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న హింసపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో భాజపా ప్రదర్శనను ఈ తీర్మానం శ్లాఘించింది. కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీ‡యూష్ గోయల్, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్..ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భాజపా సీనియర్ నేతలు ఎల్.కె.ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల్లోని పార్టీ నేతలు వర్చువల్గా హాజరయ్యారు.
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశానికి వస్తున్న ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా
గజమాలతో మోదీకి సన్మానం
జాతీయ కార్యనిర్వాహక వర్గం మోదీని గజమాలతో సత్కరించింది. కొవిడ్ మహమ్మారి సమయంలో దేశాన్ని ప్రధాని నడిపించిన తీరును నేతలు కొనియాడారు. అంతకుముందు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసం చేస్తూ.. పశ్చిమ బెంగాల్లో పార్టీ అద్భుత విజయాలు సాధించిందని అన్నారు. సమకాలీన భారత రాజకీయాల్లో ఈ స్థాయిలో ఓ రాజకీయ పార్టీ ఎదగడం అరుదని పేర్కొన్నారు. భాజపా అత్యుత్తమ ప్రదర్శన ఇంకా రావాల్సి ఉందని అన్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒడిశాల్లో కూడా భాజపా విస్తరిస్తోందని పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో సిక్కు ఓటర్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సేవలను కూడా నడ్డా ప్రస్తావించారు. రూ.120 కోట్లతో కర్తార్సింగ్ నడవాను ప్రభుత్వం పూర్తి చేసిందని, 1984 నాటి అల్లర్లపై దర్యాప్తును కూడా కేంద్రం వేగవంతం చేసిందని పేర్కొన్నారు.
చర్చ.. ఎన్నికల రాష్ట్రాలపైనే..
జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల(ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, మణిపుర్, గోవా, ఉత్తరాఖండ్) ఎన్నికలపైనే చర్చ జరిగింది. ఈ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మోదీ, ఇతర సీనియర్ నాయకులు దిశానిర్దేశం చేశారు. కొవిడ్, జమ్మూకశ్మీర్ పరిస్థితి.. తదితర అంశాలపైనా చర్చ జరిగింది. పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్ష జరిపారు. ఈ ఏడాది డిసెంబర్ 25కల్లా దేశవ్యాప్తంగా ఉన్న 10.40 లక్షల పోలింగ్ కేంద్రాల్లో బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. ఓటర్ల జాబితాలోని పేజీకో వ్యక్తిని బాధ్యుడిగా నియమిస్తూ గుజరాత్లో చేసిన ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. బూత్కమిటీ స్థాయిలో మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం వినేలా చర్యల చేపట్టాలని నాయకులు తీర్మానించారు. త్వరలో శాసనసభ ఎన్నికలకు వెళుతున్న ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పంజాబ్ పార్టీ అధ్యక్షుడు ఈ సందర్భంగా తమ నివేదికలు సమర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ