Bandi Sanjay: తొలి సంతకం ఉచిత విద్య, వైద్యంపైనే
రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించేలా తొలి సంతకం చేస్తామని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా మొదటి పని ఇదే అన్నారు. గడీల పాలనకు చరమగీతం పాడతామన్నారు. ఆయన చేపట్టిన ...
ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఈటల గెలుపు అనంతరం జైత్రయాత్ర పేరుతో కొనసాగిస్తానని వెల్లడి
తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైంది: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
ఈనాడు డిజిటల్- సిద్దిపేట, న్యూస్టుడే-హుస్నాబాద్, హుస్నాబాద్ గ్రామీణం : రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించేలా తొలి సంతకం చేస్తామని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా మొదటి పని ఇదే అన్నారు. గడీల పాలనకు చరమగీతం పాడతామన్నారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొలివిడత శనివారం ముగిసింది. ఆగస్టు 28న హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమై 36 రోజుల పాటు 438 కి.మీ. మేర సాగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన ముగింపుసభకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి స్మృతిఇరానీ హాజరయ్యారు. సభలో సంజయ్ మాట్లాడుతూ.. ‘తెరాస అవినీతి పాలనను అంతమొందించి.. ప్రజాస్వామ్య తెలంగాణను సాధించేందుకే ఈ యాత్ర చేపట్టా. ఈ పోరాటమే చివరిది కావాలి. 2018 ఎన్నికల్లో తెరాస ఆశీర్వాద సభ పేరిట హుస్నాబాద్ నుంచే ప్రచారం ప్రారంభించింది. ఇప్పుడు ఈ యాత్ర ముగింపు ఆ పార్టీకి వీడ్కోలు సభ కావాలి. భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు స్వాగతవేదికవ్వాలి. యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలు, ప్రజల ఆకాంక్షలే వచ్చే ఎన్నికల్లో మా ఎజెండా.
బ్రాండ్ అంబాసిడర్లు వీళ్లే
ఓ సందర్భంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి ప్రతిపక్షాలు బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. నా పాదయాత్రలో సమస్యలు చెప్పుకొన్న బాధితులే రాష్ట్ర దుస్థితికి నిజమైన రాయబారులు. మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు.. శిరీష అనే విద్యార్థి నా వద్దకు వచ్చి.. డిగ్రీ చదివినా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నానని చెప్పారు. మరో విద్యార్థి వనజాక్షి ఎంఏ చదివి చాయ్ అమ్మాల్సిన దుస్థితి ఏర్పడిందని కన్నీరు పెట్టుకున్నారు. మిడ్మానేరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులెంతో మంది పరిహారం రాలేదని వాపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం తెరాస రజాకార్ల పాలన కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా భైంసాలో దాడులు మర్చిపోలేకపోతున్నాం. ఇలాంటివి పునరావృతమైతే.. అక్కడ భారీ సభ ఏర్పాటు చేసి భాజపా సత్తా చూపిస్తాం. రాష్ట్రంలో మత విద్వేషాలకు తావులేకుండా చేస్తాం. ఒక వర్గానికి కొమ్ముకాసే పార్టీల పాలనను అడ్డుకుంటాం. హిందూ సమాజానికి, పేద ప్రజలకు న్యాయం జరగాలంటే 2023 ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావాలి. తెరాస పాలనలో హిందువులు వినాయకచవితి ఉత్సవాలు జరుపుకోవాలన్నా.. అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. అభివృద్ధిపై మాట్లాడితే.. సంజయ్ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నాడని కొందరు అంటున్నారు... 80 శాతం ఉన్న హిందువుల కోసం బరాబర్ పని చేస్తాం. హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ కేసీఆర్ కరీంనగర్లో మాట్లాడితే.. అక్కడ తెరాసను బొందపెట్టారన్న విషయం మర్చిపోవద్దు. హుజూరాబాద్లో తెరాస ఎన్ని డబ్బులు పంచినా విజయం మాత్రం ఈటల రాజేందర్దే. ఆ ఎన్నికల్లో భాజపా గెలుపు తర్వాత జైత్రయాత్ర పేరుతో.. ప్రజాసంగ్రామ యాత్రను తిరిగి కొనసాగిస్తా.
తెరాస గొప్పలకు పోతోంది
ధనిక రాష్ట్రం అంటూ తెరాస గొప్పలకు పోతోంది.. అలా అయితే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సక్రమంగా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. వేల మంది ఫీల్డ్అసిస్టెంట్లు, విద్యా వలంటీర్లు, స్టాఫ్ నర్సులు, పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను ఎందుకు తొలగించారు. సరైన సమయంలో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.వేల కోట్ల నిధులు ఇస్తుంటే..తెరాస నేతలు అన్నీ తామే చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు’ అని విమర్శించారు.
తెలంగాణ వికాసం భాజపాతోనే సాధ్యం : స్మృతి ఇరానీ
ప్రజా సంగ్రామ యాత్రను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రజలకు వందనాలు అంటూ కేంద్ర మంత్రి స్మృతిఇరానీ మాట్లాడారు. ‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైంది. రాష్ట్రంలో అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడాలి. తెరాసకు కారున్నా.. స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉంది. అలాంటప్పుడు తెలంగాణ వికాసానికి ఎలా పనిచేస్తారు. అది భాజపాతోనే సాధ్యం. వచ్చే ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే.. ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తానని హామీ ఇచ్చి అమలుచేయని వ్యక్తి కేసీఆర్.. ఆయన ఎంఐఎంను చూసి భయపడుతున్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి అనేక నిధులిస్తోంది. భాజపా అధికారంలోకి వచ్చాక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 2016లో 12 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పునరుద్ధరించాం. 18 కోట్ల మంది పేదలకు 14 నెలలుగా కేంద్రం ఉచిత రేషన్ ఇస్తోంది. సొంతింటి కోసం ఆయన ప్రగతిభవన్ కట్టుకుంటారు.. సెక్రటేరియట్ను కూలగొట్టి కొత్తది కడుతున్నారు. పేదలుండేందుకు మాత్రం సొంతిళ్లు ఇవ్వరా. దళితుల అభ్యున్నతికి భాజపా ప్రభుత్వం రూ.25 వేల కోట్లు వెచ్చించింది. రైతుల కోసం పత్తికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వమే’ అని చెప్పారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘హుజూరాబాద్లో అంబేడ్కర్ రాసిన రాజ్యం అమలు కావడం లేదు. కేసీఆర్ రాజ్యాంగాన్ని ఆయన బానిసలు అమలు చేస్తున్నారు. ఒక్క ఉప ఎన్నికకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదే ఖర్చు రాష్ట్రమంతా చేయాలి. ఎన్నికల ఫలితాలపై తెరాస ఎన్ని నివేదికలు తెప్పించినా.. గెలుపు భాజపాదే’ అన్నారు. అంతకు ముందు మధ్యాహ్నం బండి సంజయ్ పట్టణంలోని తిరుమల గార్డెన్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి రోడ్షో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యే రఘునందన్రావు, నేతలు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్