CM KCR: సుబ్రహ్మణ్యస్వామి, టికాయిత్లతో కేసీఆర్ భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయిత్తో గురువారం భేటీ అయ్యారు. దిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాససానికి వచ్చిన వారికి సీఎం కేసీఆర్,
నేడు రాంచీకి ప్రయాణం
హేమంత్ సోరెన్తో భేటీ
ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయిత్తో గురువారం భేటీ అయ్యారు. దిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాససానికి వచ్చిన వారికి సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ స్వాగతం పలికారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్ సమకాలీన రాజకీయాలపై చర్చించారు. దేశంలోని ఆర్థిక, రాజకీయ వ్యవహారాలతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రక్షణ అంశాలపైనా కేసీఆర్తో చర్చించినట్లు సమావేశం అనంతరం సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. తనకు అన్ని పార్టీల్లోనూ స్నేహితులున్నారని చెప్పారు. 2016లో రాజ్యసభకు నామినేట్ అయిన సుబ్రహ్మణ్యస్వామి ఇటీవలి కాలంలో తరచూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఏప్రిల్లో ముగియనున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాకేష్ టికాయిత్, బీకేయూ నాయకులతో సాయంత్రం 4.30 గంటల వరకు ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, తదితర అంశాలను టికాయిత్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. అనంతరం తెలంగాణలో రైతులకు అండగా నిలుస్తున్న తీరును ముఖ్యమంత్రి వారికి వివరించారు.
ప్రజాఫ్రంట్ అవసరమే: రాకేష్ టికాయిత్
‘నేను రాజకీయాలకు సంబంధం లేని మనిషిని. రాజకీయేతర అంశాలే కేసీఆర్తో చర్చించాం. వివిధ రాష్ట్రాల్లోని వ్యవసాయ విధానాలను పరిశీలిస్తున్నాం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ వాటిపైనే చర్చిస్తున్నాం’ అని బీకేయూ నేత రాకేష్ టికాయిత్ అనంతరం విలేకరులతో అన్నారు. ‘‘రైతు ఉద్యమంలో అమరులైన కుటుంబాల జాబితాను సీఎం కేసీఆర్కు ఈ నెల 10 వరకు అందజేస్తాం. చనిపోయిన రైతుల్లో వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఉండడం వల్ల వివరాల సేకరణ ఆలస్యమైంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, ఉచిత విద్యుత్ విధానాలు బాగున్నాయి. వాటిని దేశమంతటా అమలు చేయాలి. వచ్చే ఏడాది అంతర్జాతీయ కిసాన్ సమ్మేళనం నిర్వహించాలనుకుంటున్నాం. ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు ఎక్కడ నిర్వహిస్తారని కేసీఆర్ అడిగారు.. వేదిక నిర్ణయించలేదని చెప్పగా, హైదరాబాద్లో పెట్టుకోవాలని సూచించారు. రాజకీయాల్లోనూ పోటీ ఉండాలి.. ప్రజాఫ్రంట్ రావాల్సి ఉంది’’ అని టికాయిత్ తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లో భాజపాపై వ్యతిరేకత ఉందని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
నేడు ఝార్ఖండ్ సీఎంతో చర్చలు
ఈనాడు, హైదరాబాద్: సీఎం కేసీఆర్ శుక్రవారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్తో భేటీ కానున్నారు. భాజపాకు వ్యతిరేక కూటమి ఏర్పాటులో భాగంగా వివిధ రాష్ట్రాలు పర్యటిస్తున్న ఆయన తాజాగా హేమంత్ సొరేన్ను కలవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. జేఎంఎం అధ్యక్షుడైన హేమంత్ సొరేన్ 2018 మార్చిలో కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు.
అమర జవాన్ల కుటుంబాలకు సాయం
రాంచీలోని ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ రూ. పదేసి లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. 2020 జూన్లో సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మనదేశానికి చెందిన కల్నల్ సంతోష్బాబు సహా మరో 19 మంది సైనికులు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో ఝార్ఖండ్కు చెందినవారు ఇద్దరు ఉన్నారు. శుక్రవారం రాంచీలో వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్తో కలిసి పరిహారం అందించనున్నారు. మిగిలిన జవాన్ల కుటుంబాలకు 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం పరిహారం పంపిణీ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి